తిరుపతి, కడపలో ఇంధన కొరత.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు
ABN, Publish Date - Apr 26 , 2026 | 01:18 PM
ఏపీలోని తిరుపతి, కడప నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో భయంతో అధికంగా నిల్వలు చేయకుండా, అవసరమైనంత మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు.
1/10
ఏపీలోని తిరుపతి, కడప నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.
2/10
ఇలాంటి సందర్భాల్లో భయంతో అధికంగా నిల్వలు చేయకుండా, అవసరమైనంత మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు.
3/10
తిరుపతి, కడప నగరాల్లో డీజిల్, పెట్రోల్ కొరత పరిస్థితులు తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇంధనం కోసం వాహనదారులు బంకుల వద్ద భారీగా క్యూ లైన్లలో నిలబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
4/10
తిరుపతి నగరంలో పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఉదయం నుంచే బంకుల వద్ద రద్దీ పెరిగి, గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
5/10
కొంతమంది పెద్ద క్యాన్లతో వచ్చి డీజిల్, పెట్రోల్ నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కడప నగరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
6/10
పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ కనిపిస్తుండగా, కొన్నిచోట్ల స్టాక్ అయిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
7/10
రైతులు, ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి క్యూ లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.
8/10
అత్యవసర ప్రయాణాలు చేసేవారు కూడా ఇంధనం అందక ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెరుగుతాయనే భయంతో నిల్వలు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
9/10
ట్రాన్స్పోర్ట్, వ్యవసాయ రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. సరఫరాలో అంతరాయం , ఇంధనం డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం, రవాణా సమస్యలు వంటి అంశాలు కారణమై ఉండవచ్చని ప్రజలు భావిస్తున్నారు.
10/10
ఈ పరిస్థితిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంధన సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవడం, బంకుల వద్ద నియంత్రణ ఏర్పాటు చేయడం అత్యవసమని ప్రజలు తెలిపారు.
Updated at - Apr 26 , 2026 | 01:22 PM