ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
ABN, Publish Date - Jul 23 , 2026 | 07:25 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో పర్యటించారు. హస్తీన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలిశారు. ఆయా సమావేశాల్లో ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై సీఎం చర్చించారు.
1/16
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో పర్యటించారు. హస్తీన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలిశారు.
2/16
ఆయా సమావేశాల్లో ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై సీఎం చర్చించారు.
3/16
ప్రధాని నరేంద్రమోదీతో సీఎం చంద్రబాబు గంటకు పైగా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడారు.
4/16
ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.
5/16
అలాగే, కీలక బిల్లుల ఆమోదంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్కు సంబంధించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై దాదాపు 40 నిమిషాలు ముఖాముఖి చర్చలు జరిపారు.
6/16
వచ్చేవారం పార్లమెంటులో కొన్ని కీలక బిల్లులు ఆమోదం పొందుతాయి. ఆ తర్వాతి వారంలో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించి... మహిళలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రిజర్వేషన్ను అమలు చేయాలని భావిస్తున్నామని సీఎం చంద్రబాబుకు మోదీ చెప్పినట్లు తెలిసింది.
7/16
అలాగే, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
8/16
ఈ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, కొత్త పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
9/16
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించడంపై మాట్లాడారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.
10/16
కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
11/16
ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సవివరంగా చర్చించారు.
12/16
ముఖ్యంగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ పురోగతి, కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.
13/16
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
14/16
ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాల నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నీటి వనరుల వినియోగం, భవిష్యత్తు జల ప్రణాళికలపై సవివరంగా చర్చించారు.
15/16
ఏపీ వ్యవసాయాభివృద్ధికి అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అమలు, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు తదితర అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.
16/16
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ప్రధాన జలవనరుల ప్రాజెక్టులు, వాటి అభివృద్ధికి కేంద్ర సహకారం, నిధుల కేటాయింపు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
Updated at - Jul 23 , 2026 | 08:00 AM