నంద్యాల జిల్లాలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jul 09 , 2026 | 09:17 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
1/13
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
2/13
అప్పలాపురం, కాపులపల్లి రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు.
3/13
మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అలాగే తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.
4/13
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1500 మందితో బనగానపల్లిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
5/13
ప్రజలకు సేవలు ఎలా అందుతున్నాయో సంబంధిత అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. అనంతరం రైతులతోనూ ముఖ్యమంత్రి చర్చించారు.
6/13
అనంతరం ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. జగన్ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.
7/13
వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించిందని ధ్వజమెత్తారు.
8/13
జగన్ హయాంలో మాట వినని వారి భూములను 22ఏ జాబితాలో చేర్చారని సీఎం చంద్రబాబు ఆగ్రహించారు.
9/13
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.
10/13
ప్రజల ఆస్తిపై ప్రజలకే హక్కు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. భూమి ప్రజలదైతే పట్టా పుస్తకాలపై, భూమి సరిహద్దు రాళ్లపై వారి ఫొటోలు, పేర్లు మాత్రమే ముద్రించాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
11/13
జగన్కు ఫొటోల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని సీఎం విమర్శించారు. ఆయన ఫొటోలతో ఉన్న పాత పట్టాదారు పాస్పుస్తకాలను రద్దు చేసి, ఇప్పుడు రాజముద్రతో పాస్పుస్తకాలను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.
12/13
రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
13/13
ప్రతి సమస్యనూ పరిష్కరించే బాధ్యత తమదేనని చెప్పారు. దళారీ వ్యవస్థకు తావు లేకుండా గ్రామసభల్లోనే పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Updated at - Jul 09 , 2026 | 09:35 PM