రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ముహూర్తం ఫిక్స్
ABN , Publish Date - Jun 17 , 2026 | 07:39 PM
రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా నిధులు అందిస్తుంది. 23వ పీఎం కిసాన్ యోజన నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది.
న్యూఢిల్లీ, జూన్ 17: రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా నిధులు అందిస్తుంది. 23వ పీఎం కిసాన్ యోజన నిధుల విడుదలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దాంతో ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున నగదు జమ కానుంది. ప్రతి ఏటా మూడు దఫాలుగా ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పథకం ద్వారా ఏడాదికి మొత్తం రూ. 6 వేలు రైతుల ఖాతాలో నగదు జమ అవుతాయి. అవి మూడు దఫాలుగా.. నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో ఈ నగదు కేంద్రం వేస్తోంది. 2019లో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 13వ తేదీన 22వ విడత నగదును అసోంలోని గౌహతి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం విదితమే.
ఇవీ చదవండి:
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్
'బాస్' పేరిట వాట్సాప్ మోసం.. రూ.10.4 కోట్లకు పైగా బురిడీ