ఇరాన్లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
ABN , Publish Date - Aug 31 , 2026 | 08:01 PM
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం లక్ష మందికి పైగా నిరసనకారులను చంపిందని ఆయన ఆరోపించారు. ఈ మరణాలకు బాధ్యులైన ఇరాన్ నాయకత్వంపై యుద్ధ నేరాల కింద విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం లక్ష మందికి పైగా నిరసనకారులను చంపిందని ఆయన ఆరోపించారు. ఈ మరణాలకు బాధ్యులైన ఇరాన్ నాయకత్వంపై యుద్ధ నేరాల కింద విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ట్రంప్ సోమవారం తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్'లో ఇరాన్ను 'విఫల దేశం'గా అభివర్ణించారు (Donald Trump Iran protesters).
ఇరాన్కు నౌకాదళం, వైమానిక దళం, కరెన్సీ లేవని, సైనికులు, పోలీసులకు జీతాలు చెల్లించడం లేదని, దేశంలో ద్రవ్యోల్బణం 300 శాతంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అధికారికంగా ఒక 'విఫల దేశం'గా మారిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ నాయకత్వం పూర్తిగా గందరగోళంలో ఉందని, దేశాన్ని సక్రమంగా నడిపించే పరిస్థితిలో లేదని ఆయన ఆరోపించారు (Trump Iran claims).
ఇరాన్ తన దేశంలోని నిరసనకారులను చంపుతోందని, ఇప్పటివరకు లక్ష మందికి పైగా మరణించారని ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు (US Iran conflict). ఈ మరణాలకు బాధ్యులైన వారిని యుద్ధ నేరాలపై విచారించాలని ఆయన అన్నారు. అయితే ట్రంప్ చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలూ లేవు. లక్ష మంది నిరసనకారులు మరణించారన్న సంఖ్యను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు లేదా స్వతంత్ర పరిశీలకులు ధ్రువీకరించలేదు.
ఇవి కూడా చదవండి..
2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..