రోజూ ఒక రేగు పండు తింటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుందా?
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:01 PM
రేగు పండ్లు చలికాలంలో లభించే అత్యంత పోషకమైన, రుచికరమైన పండ్లు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పండ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిరోజూ ఒక రేగు పండు తింటే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. నిపుణుల ప్రకారం, రేగు పండ్లు రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్యానికీ చాలా మేలు చేస్తాయి. శీతాకాలంలో సులభంగా లభించే ఈ పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
రేగు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని రోగాల నుంచి కాపాడతాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మంచి నిద్రకు సహాయం:
మనస్సును రేగు పండ్లు ప్రశాంతంగా ఉంచుతాయి. నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన సమస్యలు తగ్గుతాయి. నిద్ర సరిగ్గా పట్టని వారికి ఇవి మంచి పరిష్కారం చూపిస్తాయి.
క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది:
క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో రేగు పండ్లలోని విటమిన్ సి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
చర్మం, జుట్టుకు మేలు:
రేగు పండ్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. జుట్టు రాలడం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతారు.
ఇతర ప్రయోజనాలు:
రక్తహీనత తగ్గుతుంది.
ఎముకలు బలపడతాయి.
రక్త ప్రసరణ మెరుగవుతుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
గర్భిణీ స్త్రీలకు వికారం, వాంతులు తగ్గుతాయి.
మహిళల్లో అధిక రుతు రక్తస్రావం తగ్గడానికి సహాయపడుతుంది.
మొత్తానికి, ప్రతిరోజూ ఒక రేగు పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News