విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్
ABN , Publish Date - Mar 27 , 2026 | 10:15 AM
విశాఖపట్నంలో రూ.217 కోట్ల భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన 72 నకిలీ సంస్థల నెట్వర్క్ను డీజీజీఐ అధికారులు ఛేదించారు.
విశాఖపట్నం, మార్చి 27: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(DGGI) అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో రూ.217 కోట్ల భారీ జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన 72 నకిలీ సంస్థల (Shell Entities) నెట్వర్క్ను అధికారులు ఛేదించారు. ఈ నకిలీ కంపెనీలు ఎటువంటి వస్తువులను సరఫరా చేయకుండానే కేవలం కాగితాలపై రూ.1,472 కోట్ల విలువైన లావాదేవీలు సృష్టించిన వైనం బయటపడింది.
సామాన్యుల ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి.. తప్పుడు పత్రాలతో ఫోర్జరీ రిజిస్ట్రేషన్లు చేసి ఈ నకిలీ సంస్థలను నడిపిన కేటుగాళ్లను డీజీజీఐ అధికారులు గుర్తించారు. ఈ కేసులో టెక్నికల్ పనులు చూసే సిద్ధగోని ప్రభాకర్, తప్పుడు పత్రాలు సృష్టించిన నాగరాజు నాయక్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ భారీ జీఎస్టీ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి ధంట్ల ఆదిరెడ్డి (అంజి రెడ్డి) పరారీలో ఉన్నాడు. అతని కోసం డీజీజీఐ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితులపై సీజీఎస్టీ చట్టం 2017 ప్రకారం బెయిల్ రాని నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అత్యాధునిక డేటా అనలిటిక్స్ సాయంతో ఈ భారీ ట్యాక్స్ క్రెడిట్ (ITC) మోసాన్ని విశాఖపట్నం జోనల్ యూనిట్ అధికారులు కనిపెట్టారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
సింహాచలం కొండ దిగువన గుర్తుతెలియని వ్యక్తుల ఘాతుకం
Read Latest AP News And Telugu News