Share News

మంత్రి ఫిర్యాదు.. బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదు

ABN , Publish Date - May 20 , 2026 | 07:45 AM

వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కర్నూలు పట్టణంలోని త్రీ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

మంత్రి ఫిర్యాదు.. బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదు
Bairreddy Siddharth Reddy

కర్నూలు, మే20: వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు త్రీ టౌన్ సీఐ శేషయ్య వెల్లడించారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ గుప్తా ఫిర్యాదు మేరకు సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదు చేశామని ఆయన వివరించారు. మే 14వ తేదీన కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే, మంత్రి టీజీ భరత్‌ గుప్తాపై బైరెడ్డి సిద్దార్థ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.


ఈ నేపథ్యంలో సిద్దార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు, పరువుకు భంగం కలిగించడంతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో మంత్రి భరత్ గుప్తా స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రేమ జంటకు కుల పెద్దల జరిమానా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

జలమండలి జీఎం రూ.100 కోట్లు

For More AP News And Telugu News

Updated Date - May 20 , 2026 | 08:02 AM