వెలిగొండ నిర్వాసితులకు పరిహారం.. మూడో విడతగా రూ.250 కోట్ల పంపిణీ
ABN , Publish Date - Aug 22 , 2026 | 10:05 AM
వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు సీఎం అందజేశారు.
అమరావతి, ఆగస్టు 22: వెలిగొండ నిర్వాసితులకు మరో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. మూడో విడతగా రూ.250 కోట్ల పరిహారం చెక్కును నిర్వాసితులకు సీఎం అందజేశారు. దీంతో ఇప్పటి వరకూ రూ.768 కోట్లను నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. మొదటి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లు చెల్లించింది.
మూడో విడతగా ఈరోజు(శనివారం) 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇప్పటి వరకూ మొత్తం 6,206 కుటుంబాలకు రూ.768 కోట్ల మేర పరిహారాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. దీంతో దాదాపు 85 శాతం మేర ఆర్ అండ్ ఆర్ పూర్తి అయ్యింది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను త్వరలోనే కూటమి ప్రజా ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఇవి కూడా చదవండి...
ప్రియాంక కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ల పని.. జగన్పై వర్ల రామయ్య ఫైర్
Read Latest AP News And Telugu News