ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:20 PM
ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం అంజెడా అంశాలు ముగిశాక వివిధ పరిణామాలపై సీఎం చర్చించారు.
అమరావతి, ఆగస్టు 18: ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గం అంజెడా అంశాలు ముగిశాక వివిధ పరిణామాలపై సీఎం చర్చించారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లపై ధీటుగా స్పందించాలని మంత్రులకు సూచించారు. అక్టోబర్లోగా స్థానిక ఎన్నికలు జరగకుంటే రూ.12150 కోట్లు అర్బన్ లోకల్ బాడీ నిధులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
న్యాయ పరిధిలో 23 మున్సిపాలిటీల విలీన ప్రక్రియను తర్వాత చూసుకుందామని.. ముందైతే అన్నింటిలోనూ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మద్యం బ్రాండ్లు పిచ్చి పిచ్చి పేర్లతో రాకుండా కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అక్రమార్కులు కంటైనర్లలో ఇసుక తరలింపునకు యత్నిస్తుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
విశాఖపట్నంలో రెండు మృతదేహాల కలకలం..
ఆలయ ఉద్యోగాల్లో జోనల్ విధానం లేదు.. మెరిట్కే ప్రాధాన్యం: మంత్రి ఆనం రామనారాయణ
Read Latest AP News And Telugu News