వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు: వైఎస్ సునీతా రెడ్డి
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:37 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
కడప, ఆగస్టు 8: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈరోజు(శనివారం) వైఎస్ వివేకా 75వ జయంతి సందర్భంగా పులివెందుల్లోని వివేకా సమాధి వద్ద కుమార్తె వైఎస్ సునీత కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తండ్రి వివేక హత్య కేసు విషయంలో గత ఆరునెలల కాలంగా జడ్జిమెంట్లు కూడా సరిగా లేవని నా అభిప్రాయం. విచారణలో అవకతవకలు ఉండడం వల్లే ఇన్నిసార్లు కోర్టుమెట్లు ఎక్కాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చారు.
ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని సునీత అన్నారు. వివేక హత్య జరిగిందని అందరికంటే ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తెలుసు అని సునీత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
వైసీపీ నేతలకు కోట్ల విలువైన భూముల అప్పగింత.. డిప్యూటీ కలెక్టర్పై కేసు
మహిళా ఎస్ఐపై అసభ్య ప్రవర్తన.. వైసీపీ నేత కోసం పోలీసుల గాలింపు
Read Latest AP News And Telugu News