Share News

రాజంపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. హాస్టల్ యజమానిపై కర్రలతో దాడి!

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:03 AM

కడప జిల్లా రాజం‌పేటలో గంజాయి ముఠా తీవ్ర కలకలం సృషించింది. స్థానిక అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే..

రాజంపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. హాస్టల్ యజమానిపై కర్రలతో దాడి!
Rajampet Ganja Gang Attack

కడప, మార్చి 9: కడప జిల్లా రాజం‌పేటలో గంజాయి ముఠా తీవ్ర కలకలం సృషించింది. స్థానిక అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు వీరంగం సృష్టించి, ఒక ప్రైవేట్ హాస్టల్ యజమానిని రోడ్డుపై తిప్పుతూ కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో సదరు వ్యక్తితో పాటు మరికొంతమంది గాయపడ్డట్టు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది.


రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో గిరి అనే వ్యక్తి ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి మత్తులో ఉన్న కొంతమంది యువకులు గిరిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. విధిలో తిప్పుతూ.. గిరిని విచక్షణారహితంగా కొట్టారు. గంజాయి మత్తులో ఊగిపోతూ వారు చేసిన ఈ దాడిని చూసి స్థానికులు భయంతో వణికిపోయారు.


ఈ దాడి గంజాయి మత్తులో జరిగినదే అయినా, దీని వెనుక వేరే కారణాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో మరో ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్న వ్యక్తి, వ్యాపార శత్రుత్వంతోనే ఈ గంజాయి బ్యాచ్‌ని పంపి దాడి చేయించి ఉండొచ్చని బాధితుడు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.


Also Read:

ప్రీమియం బారెడు క్లెయిమ్‌ మూరెడు!

నేనక్కడే ఉన్నా.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు..!

For More Latest News

Updated Date - Mar 09 , 2026 | 11:03 AM