పలు జిల్లాలకు అధ్యక్షులను నియమించిన ఏపీ బీజేపీ చీఫ్
ABN , Publish Date - May 15 , 2026 | 11:07 AM
తెలుగు రాష్ట్రాల్లో మరింత బలపడే దిశగా భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ శుక్రవారం నియమించారు.
అమరావతి, మే 15: తెలుగు రాష్ట్రాల్లో మరింత బలపడే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ నియమించారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నియామకాలు జరిగాయని స్పష్టం చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
జిల్లాలు.. బీజేపీ అధ్యక్షులు..
పోలవరం జిల్లా: బుల్లికొండలు దొర
మార్కాపురం జిల్లా: పోశం వెంకటకృష్ణారావు
బాపట్ల జిల్లా: మువ్వల వెంకట రమణారావు
అన్నమయ్య జిల్లా: పులిరెడ్డి నరేంద్ర కుమార్రెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి..
ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి లోకేశ్
For More AP News And Telugu News