Share News

రైల్వే జోన్ ప్రారంభం.. చారిత్రాత్మక మైలురాయి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 31 , 2026 | 07:47 PM

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సోమవారం (జూన్1వ తేదీ) నుంచి పని చేయడం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం స్పందించారు.

రైల్వే జోన్ ప్రారంభం.. చారిత్రాత్మక మైలురాయి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

అమరావతి,మే 31: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సోమవారం (జూన్1వ తేదీ) నుంచి పని చేయడం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం స్పందించారు. ఆయన ఎమన్నారంటే.. ‘జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాల మన కల నెరవేరుతోంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది.

కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ఇది ఒక కీలక మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి రాష్ట్ర ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైల్వే జోన్‌తో మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు: మంత్రి సత్యకుమార్

సీఎం రేవంత్ మాటలకు విశ్వసనీయత ఉందా?..: ఎమ్మెల్యే హరీష్ రావు

For More AP News And Telugu News

Updated Date - May 31 , 2026 | 08:20 PM