వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
ABN , Publish Date - Feb 09 , 2026 | 06:45 PM
వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో బెయిల్ లభించింది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 9: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయనకు బెయిల్ లభించింది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు ఈ రోజు (ఫిబ్రవరి 9) బెయిల్ పిటిషన్పై వాదనలు విని, కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది.
కేసు నేపథ్యం.. అరెస్ట్..
ఫిబ్రవరి 1న నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, దీంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తాయనే ఆరోపణలపై కేసు నమోదైంది.
రిమాండ్..
ఫిబ్రవరి 2న గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించి, ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించింది.
బెయిల్ హియరింగ్..
బెయిల్ పిటిషన్పై ఇవాళ వాదనలు పూర్తయ్యాయి. ఆయన వయసు, ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా.. ఈ కేసులో కస్టడీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
ప్రస్తుత స్థితి..
ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరైనప్పటికీ, ఇతర కేసుల్లో రిమాండ్ కొనసాగుతోంది. గత నవంబర్ 12న నమోదైన ఒక కేసులో ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగించిన సంగతి తెలిసిందే.
అంబటి మీద మొత్తం 36కు పైగా కేసులు.. గుంటూరు, ఈస్ట్ గోదావరి, బాపట్ల, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసులు క్వాష్ చేయాలని దాఖలైన పిటిషన్ను కోర్టు ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీల లేఖ