Home » Bail
లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన ఢిల్లీ లేదా లక్నోలోనే ఉండాలంటూ ఆదేశించింది.
కింది కోర్టులు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విఽధించేటప్పుడు పైకోర్టులు యాంత్రికంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన కారణాలు చెప్పకుండా స్టే ఇవ్వకూడదని తెలిపింది.
జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు బెయిలు మంజూరు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సోమవారంనాడు సవాలు చేసింది. సోరెన్కు బెయిలు మంజూరు చేయడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈడీ పేర్కొంది.
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ ప్రారంభం కాగా.. సీబీఐ జూన్ 7న వేసిన ఛార్జిషీట్లో తప్పులు ఉన్నాయని, అందుకే ఎమ్మెల్సీ కవితని రిలీజ్ చేయాలంటూ ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సీబీఐ రీఫైలింగ్ చేసిన చార్జిషీట్లోనూ తప్పులు ఉన్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై విచారణకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటాననో లేదా మరో విధంగానో యువతులను మోసగించి లైంగికంగా సంబంధం పెట్టుకోవటాన్ని సెక్షన్ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం సుప్రీం కోర్టు(Supreme Court) తలుపుతట్టారు. లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) ఆయనకు ఇటీవలే రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం విదితమే.
సీఎం జగన్పై రాయి దాడి కేసులో ఏ1 నిందితుడు సతీశ్కు బెయిల్ లభించింది. నిందితుడికి విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్పై రాయిదాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన 8వ అదనపు జిల్లా న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తనకు మరో వారం రోజులపాటు మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని కేజ్రీవాల్ పెట్టుకొన్నఅత్యవసర పిటిషన్ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి, కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం.. కేజ్రీవాల్ పిటిషన్ను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ కు ఢిల్లీ తీజ్ హజారీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది.