Share News

అమరావతిలో ఎంట్రీకి అందుబాటులోకి రానున్న మరిన్ని రహదారులు.. మంత్రి సమీక్ష

ABN , Publish Date - Aug 20 , 2026 | 06:02 PM

రాజధాని అమరావతిలో ఎంట్రీకి మరిన్ని రహదారులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రహదారుల కనెక్టివిటీపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు.

అమరావతిలో ఎంట్రీకి అందుబాటులోకి రానున్న మరిన్ని రహదారులు.. మంత్రి సమీక్ష
AP Minister Narayana

అమ‌రావ‌తి, ఆగస్టు20: రాజధాని అమరావతిలో ఎంట్రీకి మరిన్ని రహదారులను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రహదారుల కనెక్టివిటీపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు. గురువారం E 13, E 15, E 1, E 3 రహదారి నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.


మంగ‌ళగిరి నుంచి అమ‌రావ‌తికిలోకి ప్రవేశించే E 15 రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రికి అధికారులు వివరించారు.16వ నెంబ‌ర్ జాతీయ‌ ర‌హ‌దారి నుంచి ఎయిమ్స్ ద్వారా అమ‌రావ‌తిలోకి E 13 రోడ్డు ప్రవేశించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు (E 3) మూడో ఫేజ్‌లో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ (స్టీల్ బ్రిడ్జి - మ‌ణిపాల్ హాస్పిట‌ల్) ప‌నులు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులకు మంత్రి నారాయణ సూచించారు.


సీడ్ యాక్సెస్ రోడ్డుకు స‌మాంత‌రంగా క‌ర‌కట్టను వెడ‌ల్పు చేస్తూ ప్రకాశం బ్యారేజీ వరకూ E 1 రోడ్డును నిర్మిస్తున్నారు. ఆయా రోడ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన రైల్వే ఇత‌ర అనుమ‌తులు దాదాపు కొలిక్కి వ‌చ్చాయ‌ని మంత్రి నారాయణ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. రోడ్ల ప‌నుల‌కు ఆటంకాలు లేకుండా అవ‌సర‌మైన చర్యలు తీసుకోవాల‌ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ విజ‌య‌రామ‌రాజు, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కార్తీక్, గుంటూరు జిల్లా క‌లెక్టర్ సాయికాంత్ వర్మతోపాటు వివిధ శాఖల ఇంజినీర్లు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్

కుమార్తె వ్యాఖ్యలు.. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన మంత్రి కొండా సురేఖ

For More AP News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 06:13 PM