గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్కు బుల్లెట్ గాయం
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:12 AM
కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం వద్ద పోలీసు అధికారి గన్ మిస్ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ధనరాజు ఛాతిలోంచి బుల్లెట్ బయటకు వచ్చింది.
కాకినాడ, ఏప్రిల్ 20: కాకినాడలో గన్ మిస్ఫైర్ కలకలం రేపింది. కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం వద్ద డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి గన్ మిస్ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ధనరాజు ఛాతిలోంచి బుల్లెట్ బయటకు వచ్చింది. ఈవీఎం గోదాం భద్రతా డ్యూటీలో ఉన్న సమయంలో అతని తుపాకీ ఆకస్మికంగా మిస్ఫైర్ అయింది. దీంతో హెడ్ కానిస్టేబుల్కు బుల్లెట్ గాయం అయ్యింది. తీవ్ర గాయాలతో రక్తస్రావమైన ధనరాజును వెంటనే కాకినాడ జీజీహెచ్కు తరలించారు.
వైద్యులు అత్యవసర చికిత్స అందించి హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ధనరాజు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాపాయం తప్పినందుకు అతని కుటుంబం, సహచరులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది మిస్ఫైరా లేక ఆత్మహత్యా ప్రయత్నమా అనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
అన్న క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు
Read Latest AP News And Telugu News