Share News

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి..

ABN , Publish Date - Mar 22 , 2026 | 09:13 AM

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఎర్నగూడెం వద్ద ఓ కారు రాంగ్ రూట్‌లో ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది.

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి..
West Godavari Road Accident

తూ.గో.జిల్లా: దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఎర్నగూడెం వద్ద ఓ కారు రాంగ్ రూట్‌లో ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారు ఈ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. రెండు కార్లు వేగంగా ఢీకొట్టుకోవడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.


స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి మృతుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రమాదం గురించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

అడవుల రక్షణ సామూహిక బాధ్యత

కూటమిదీ అప్పుల బాటే!

Updated Date - Mar 22 , 2026 | 09:21 AM