Share News

దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:40 PM

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు.

దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu

కాకినాడ జిల్లా, జూన్ 1: తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం స్వయంగా అతని దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి ఫోటో దిగడంతో ఆ దివ్యాంగ యువకుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. యువకుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ, ‘మీరంటే మా కుమారుడికి ఎంతో అభిమానం’ అని తెలిపారు. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌ను పిలిచిన సీఎం.. ప్రభుత్వం తరఫున దివ్యాంగ యువకుడికి అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.


chandrababu

అనంతరం ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా సాగుతున్న వివిధ పంటల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మైక్రో న్యూట్రియెంట్స్‌తో పాటు ప్రకృతి సేద్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.


ఇవి కూడా చదవండి..

కొత్త రైల్వే జోన్.. ఇకపై మన సమస్యలు మనమే తీర్చుకోగలం: రామ్మోహన్ నాయుడు

గొడ్డలి పార్టీ కుట్రలను బయటపెట్టిన మంత్రి అనగాని సత్యప్రసాద్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2026 | 04:01 PM