రేపటి వైసీపీ ర్యాలీకి నో పర్మిషన్.. కాదని వస్తే అరెస్టులు తప్పవు: విజయవాడ డీఎస్పీ
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:06 PM
విజయవాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు(సోమవారం)జరిగే డీఎస్సీ ర్యాలీకి అనుమతి లేదని.. పోలీసుల సూచనలకు విరుద్ధంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని విజయవాడ డీఎస్పీ కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు.
విజయవాడ, సెప్టెంబర్ 20: జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో రేపు(సోమవారం)జరిగే డీఎస్సీ ర్యాలీకి అనుమతి లేదని.. పోలీసుల సూచనలకు విరుద్ధంగా ఎవరైనా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని విజయవాడ డీఎస్పీ కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు.
రేపటి వైసీపీ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదని డీఎస్పీ వెల్లడించారు. ఈ మేరకు విజయవాడలో సెక్షన్ 30(ధర్నాలు, సభలు, ర్యాలీల నిర్వహణకు సంబంధించిన అనుమతులు) అమలులో ఉందని ఆయన తెలిపారు. వీఐపీ జోన్ ఉన్న ప్రాంతంలో ర్యాలీల నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే.. శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా.. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ
వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్కు నో పర్మిషన్: రఘురామ
For More AP News And Telugu News