Share News

జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:17 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి.. జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా? అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అని ప్రశ్నించారు.

జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
Andhra Pradesh Politics

విజయవాడ, జులై 7: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో జగన్ పట్ల కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దివంగత సీఎం జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిరం పేరుతో బీజేపీ వేల కోట్లు వసూలు చేసి అవినీతికి పాల్పడిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉందని తెలిసి కూడా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. వేలాది మంది చిన్న పిల్లల ప్రాణాలు కోల్పోతుంటే భారత విదేశాంగ విధానం స్పందించకపోవడం దారుణమని, దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా మోడీ విదేశీ శక్తుల చేతిలో ఇరుక్కుపోయారని విమర్శించారు.


చింతా మోహన్ మాట్లాడుతూ.. ‘ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వైఎస్ జగన్‌పై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దివంగత సీఎం జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా?. రాజకీయ ఒత్తిళ్లకు కోర్టులు లొంగుతున్నాయనే అనుమానం ప్రజల్లో రాకుండా న్యాయస్థానాలే చొరవ తీసుకుని జగన్ కేసులను విచారించాలి. రావణ్ తెలిసో తెలియకో నోరు జారి ఉండవచ్చని, ప్రభుత్వం ఈ విషయంలో కొంత విశాల హృదయంతో ఆలోచించాలి’ అని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

మూఢనమ్మకాలతో చిక్కులు.. ఈ యువకుడి పరిస్థితి చూస్తే..

ముంబైలో మరో దారుణం.. వీడియో వైరల్..

Updated Date - Jul 07 , 2026 | 11:34 AM