Share News

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ABN , Publish Date - Jan 02 , 2026 | 09:00 AM

రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అనంతపురం, జనవరి 02: మడకశిర మండలం అగ్రంపల్లి గ్రామం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో గూడ్స్ వాహనాన్ని ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.


మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు మడకశిర పట్టణానికి చెందిన వడ్రపాలెం రఘరాం, మరొకరు సీకే పల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఆయా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్రావెల్స్ బస్సు బోల్తా..

నంద్యాల జిల్లాలోని చాబోలు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో.. వాహనాలు బారులు తీరాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులు మృతి

కుమారుడితో కలిసి నూతిలో దూకిన తల్లి.. ఇద్దరు మృతి

For More AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 09:08 AM