వీడని జ్ఞానేశ్వరి మిస్టరీ!..100 రోజులైనా దొరకని ఆచూకీ
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:14 AM
తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 100 రోజులు దాటినా లభించలేదు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన క్లూ లభించలేదు.
తుని రూరల్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై వంద రోజులు దాటినా మిస్టరీ వీడలేదు. ఇంతకాలం గడిచినా ఆ చిన్నారి ఎక్కడ ఉంది? ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. ఈ విషయంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ.. పాప ఆచూకీపై ఎలాంటి క్లూ రావట్లేదు.
ఈ ఏడాది జూన్ 6న కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్.అగ్రహారంలోని పామాయిల్ తోటలో ఆడుకుంటున్న జ్ఞానేశ్వరి అదృశ్యమైన విషయం తెలిసిందే. కిడ్నాప్, అడవి జంతువుల దాడి తదితర కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తు వివరాలతో పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హెడ్ కానిస్టేబుల్ సాహసం
చంపేసి.. గోనెసంచిలో కుక్కేసి.. వివాహితను హత్యచేసిన ప్రియుడు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News