హైలెవల్ మీటింగ్.. మోదీ నిర్ణయాలు ఇవే
ABN, Publish Date - May 08 , 2025 | 04:05 PM
Operation Sindoor: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులతో ప్రధాని భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, మే 8: భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హైలెవల్ సమావేశం నిర్వహించారు. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులతో భేటీ అయ్యారు. రక్షణ రంగం, ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖ తదితర శాఖ కార్యదర్శులతో అత్యంత కీలకమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించడంతో పాటు, సరైన సమయంలో ప్రణాళికలు, సన్నాహాలతో అధికారులు పనిచేయాలని ప్రధాని సూచించారు.
ఈ సమావేశానికి ప్రధాని మోదీతో ప్రధాని కేబినెట్ సలహాదారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా హాజరయ్యారు. మొత్తం పది నుంచి పన్నెండు అంశాలపై సుదీర్ఘంగా సమావేశం జరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Operation Sindoor-Sania Mirza: పాక్కు ఇచ్చిపడేసిన సానియా మీర్జా.. ఇది కదా కావాల్సింది..
Operation Sindoor: జమ్మూకాశ్మీర్లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Read Latest National News And Telugu News
Updated at - May 08 , 2025 | 04:06 PM