భజన చేస్తున్న భక్తులపై దాడి..రోడ్డుపై ట్రాఫిక్ జామ్

ABN, Publish Date - Feb 07 , 2025 | 03:11 PM

పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో సూర్యాలయం వద్ద భజన చేస్తున్న భక్తులపై ఆగంతకులు దాడి చేశారు. అయితే ఈ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రథ సప్తమి సందర్భంగా భక్తులు భజన చేస్తుంటే మైక్ లాక్కొని కొంతమంది దాడి చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో సూర్యాలయం వద్ద భజన చేస్తున్న భక్తులపై ఆగంతకులు దాడి చేశారు. అయితే ఈ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రథసప్తమి సందర్భంగా భక్తులు భజన చేస్తుంటే మైక్ లాక్కొని కొంతమంది దాడి చేశారు. దీంతో భక్తులు దువ్వ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.


జైశ్రీరామ్ అంటూ భక్తులు నినాదాలు చేశారు.తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు స్పందించారు. మహిళలపై ఆగంతకులు దాడి చేసిన పోలీసులు సరిగా స్పందించ లేదని బీజేపీ ఏపీ ప్రదాన కార్యదర్శి తపన చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా సాయంత్రం దువ్వలో భారీఎత్తున ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.


మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

అన్నా క్యాంటీన్‌లో అమ్మ రాజశేఖర్ సందడి..

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళ పెట్రోల్ బాటిల్‌తో హల్ చల్

అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

అంబటి ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 07 , 2025 | 03:21 PM