Akshay Kumar: మహాకుంభ మేళాలో అక్షయ్ కుమార్
ABN, Publish Date - Feb 24 , 2025 | 03:52 PM
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహాకుంభ మేళాలో స్నానం చేశారు. మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ కుంభ మేళా ముగిసేందుకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో భక్తులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. కుంభమేళా చివరిఘట్టానికి చేరుకోవడంతో పలువురు ప్రముఖులు ఇవాళ ప్రయాగ రాజ్కు చేరుకున్నారు.
బీజేపీ నేత పంకజ్ ముండే, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో సహా పలువురు ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా.. చివరి పవిత్ర స్నానానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ప్రయాగ్రాజ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా 2025 మహా శివరాత్రి జరిగే చివరి పవిత్ర స్నానంతో ముగుయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మెట్రోపై గవర్నర్ కీలక ప్రకటన
ఐదు నిముషాల్లోనే సభ నుంచి వెళ్లిపోయిన జగన్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 24 , 2025 | 04:31 PM