ఏపీలో మెట్రోపై గవర్నర్ కీలక ప్రకటన

ABN, Publish Date - Feb 24 , 2025 | 12:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో మెట్రోపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి విశాఖలో 46 కి.మీ. మెట్రో నిర్మాణం జరుగుతుందని.. అలాగే విజయవాడలో 38.40 కి.మీ. మెట్రో రైల్‌ నిర్మాణం జరుగుతుందని ఆయన ప్రకటించారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Sessions) సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. (Governor Abdul Nazeer speech) అదే సమయంలో ఏపీలో మెట్రో (Metro)పై ఆయన కీలక ప్రకటన (Key Announcement) చేశారు. 2029 నాటికి విశాఖ (Visakha)లో 46 కి.మీ. మెట్రో నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే విజయవాడ (Vijayawada)లో 38.40 కి.మీ. మెట్రో రైల్‌ నిర్మాణం జరుగుతుందని ఆయన ప్రకటించారు.

ఈ వార్త కూడా చదవండి..

ఐదు నిముషాల్లోనే సభ నుంచి వెళ్లిపోయిన జగన్


ఎనర్జీ రంగంలో 7.5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 17,605 కిలో మీటర్ల రోడ్లకు మరమ్మతులు చేశామని, 2025-26లో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదని అన్నారు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్‌ సోలార్ ఏర్పాటు చేశామని, రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేలా.. వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్‌ ఏర్పాటు చేశామని గవర్నర్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీపై సీఐడి పిటి వారెంట్ జారీ

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ కీలక ఆదేశాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 24 , 2025 | 12:21 PM