Jagan: వైఎస్సార్సీపీ నేతలు సభలో నినాదాలు.. వెళ్లిపోయిన జగన్..
ABN , Publish Date - Feb 24 , 2025 | 10:54 AM
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతూ నినాదాలు చేశారు. ఐదు నిముషాలు నినాదాలు చేసిన అనంతరం వైఎస్ జగన్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెంట వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Sessions) సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. (Governor Abdul Nazeer speech) అదే సమయంలో గవర్నర్ ప్రసంగానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు (YSRCP MLAs) అడ్డుతగులుతూ.. నినాదాలు (Slogans) చేశారు. ఐదు నిముషాలు నినాదాలు చేసిన అనంతరం వైఎస్ జగన్ (YS Jagan) సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెంట వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.
ఈ వార్త కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ కీలక ఆదేశాలు..
బొత్స సత్యనారాయణ కామెంట్స్
అసెంబ్లీ బయట వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వానికి చిన్న చూపని, ప్రతిపక్ష హోదా కల్పించాలని మొదటి నుంచి కోరుతున్నామని అన్నారు. ప్రతిపక్షం అంటే ప్రజా పక్షం అని గుర్తుంచుకోవాలన్నారు. రైతుల సమస్యలపై గొంతూ విప్పాలంటే మాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. రైతు సమస్యలపై పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News