Share News

Hyderabad: నీటి వృథా.. మహిళకు జరిమానా

ABN , Publish Date - Mar 13 , 2025 | 06:56 AM

నీటి వృథా చేస్తున్న వారిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు కొరడా ఘుళిపొంచారు. వృథా చేస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. జర్నలిస్టు కాలనీ నీటిని వృథా చేస్తున్న మహిళకు రూ. వెయ్యి .రిమానా విధించారు.

Hyderabad: నీటి వృథా.. మహిళకు జరిమానా

హైదరాబాద్‌ సిటీ: వాటర్‌బోర్డు సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో తాగునీటితో బైక్‌ వాష్‌ చేసిన వ్యక్తికి ఫైన్‌ వేయగా, తాజాగా ఇలాంటి పనే చేసిన ఓ మహిళకు జరిమానా విధించారు. వాటర్‌బోర్డు(Waterboard) కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా జీఎం హరిశంకర్‌(GM Harishankar) స్థానిక మేనేజర్‌తో కలిసి నీటి సరఫరా సమయంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: సీఎం రేవంత్‌పై తిట్ల దండకం


city1.2.jpg

జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని జర్నలిస్టు కాలనీలో యరత శోభ తాగునీటితో వాహనం శుభ్రం చేయడాన్ని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.వెయ్యి జరిమానా విధించారు. జరిమానాల నేపథ్యంలో తాగునీటి వృథాపై వాటర్‌బోర్డు(155313)కు ఫిర్యాదులు అందుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

వాయిదా పడినా.. పట్టు వీడలేదు

మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

మంద కృష్ణ మా నాయకుడు కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 13 , 2025 | 06:56 AM