Trains: పలు రైళ్లు రద్దు.. భాగ్యనగర్, దానాపూర్ ఎక్స్ప్రెస్లు సహా మరో రెండు..
ABN , Publish Date - Feb 20 , 2025 | 10:48 AM
సికింద్రాబాద్(Secunderabad) నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భాగ్యనగర్ (సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్), దానాపూర్ (సికింద్రాబాద్ నుంచి బిహార్ ) ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు మరో రెండు రైళ్లు రద్దయ్యాయి.
- ఇబ్బందులు పడిన ప్రయాణికులు
సికింద్రాబాద్: సికింద్రాబాద్(Secunderabad) నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భాగ్యనగర్ (సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్), దానాపూర్ (సికింద్రాబాద్ నుంచి బిహార్ ) ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు మరో రెండు రైళ్లు రద్దయ్యాయి. అయితే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకునేందుకు ఆశాఖ అధికారులు అవకాశం కల్పించారు. కాని రిజర్వేషన్ కౌంటర్ ఎక్కడ ఉందో తెలియక ప్రయాణికులు సికింద్రాబాద్ కేంద్రియ రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కోర్టు చలానా కట్టేందుకు వెళ్లి..

ఈ సందర్భంగా రిజర్వేషన్ కౌంటర్(Reservation counter)లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి స్పందిస్తూ, రైళ్లు రద్దు చేశామని ఆ విషయాన్ని అనౌన్స్మెంట్ చేశామన్నారు. ఆపై రిజర్వేషన్ టికెట్ల రద్దుకు ప్రత్యేక కౌంటర్ సైతం ఏర్పాటు చేశామన్నారు. అయితే కొందరే స్పందించారని తెలిపారు. ఈ రైళ్లు రద్దుకు గల కారణాలు ఏమిటి? అనే వివరాలు తమకు తెలియదని ప్రయాణికులు చెప్పారు.
ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’ వివాదం
ఈవార్తను కూడా చదవండి: రోస్టర్ విధానంలో లోపాలు సరిచేయండి
ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్ పాల్గొనాలి..
Read Latest Telangana News and National News