Sahasra Parents and Relatives Protest : పీఎస్ ఎదుట సహస్ర తల్లి ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:07 PM
హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన సహస్ర పేరెంట్స్, బంధువుల బైఠాయించారు. అసలైన దోషులను తప్పించారంటూ ఆరోపించారు.
హైదరాబాద్, ఆగస్టు 22: హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పీఎస్ ఎదుట కూకట్పల్లిలో హత్యకు గురైన సహస్ర పేరెంట్స్, బంధువులు బైఠాయించారు. అసలైన దోషులను తప్పించారంటూ ఆరోపించారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సహస్ర తల్లి రేణుక స్టేషన్ ఎదుట గుండెలవిసేలా రోధించారు. 'నా కూతుర్ని హత్య చేసినట్లు ఆ అబ్బాయిని హత్య చేయాలి. నా మీద, నా భర్త మీద ఎన్నో ఆరోపణలు చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని మేము చంపుకున్నామని నా మీద విమర్శలు చేశారు. నా కొడుకు ఆలోచన తీరు మారింది. ఒక్క బ్యాట్ కోసం ఇంత దారుణానికి ఒడిగడతాడా. మొబైల్ తీసుకొచ్చినప్పుడే తల్లిదండ్రులు పరిశీలించి ఉంటే ఈ రోజు నా కూతురికిలా అయ్యేది కాదు. అక్కను చంపిన వాడిని నేను చంపుతాను అంటూ నా కొడుకు మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో మైనర్ అబ్బాయి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. మాకు న్యాయం జరగాలి.. నిందితుడిని మా ముందుకు తీసుకురావాలి.' అని సహస్ర తల్లి వాపోయింది.
ఆందోళన తీవ్రతరం కావడంతో సహస్ర తల్లిదండ్రులని, కుటుంబ సభ్యుల్ని పోలీసులు మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. నిరసనతో మూసాపేట్ నుంచి జేఎన్టీయూ వరకు భారీగా ట్రాఫిక్ జాం అయింది. సహస్ర తల్లిదండ్రులు, ఆందోళనకారులతో పోలీసులు చర్చిస్తున్నారు. కచ్చితంగా న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
ఇలా ఉంటే, సహస్ర తండ్రి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. 'క్రికెట్ బ్యాట్ కోసం కాదు, ఇంట్లోని డబ్బు కోసమే బాలుడు వచ్చాడు. సహస్ర హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల ప్రమేయం ఉంది. న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాం. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నట్టు అనుమానం ఉంది. పోలీసులు మరోసారి దర్యాప్తు చేయాలి' అని సహస్ర తండ్రి కృష్ణ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రధానిపై సోషల్ మీడియాలో కామెంట్స్.. తేజస్వి యాదవ్పై మహారాష్ట్ర పోలీసుల కేసు
అనిల్ అంబానీ నివాసాల్లో CBI సోదాలు
For More National News And Telugu News