KTR: టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందా..
ABN , Publish Date - May 23 , 2025 | 07:59 AM
KTR: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కోర్టులు అనుకూలంగా తీర్పు ఇస్తే… తప్పు అని చెప్తారా.. కంచె గచ్చిబౌలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా.. మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

హైదరాబాద్: పాలమూరు (Palamuru)-రంగారెడ్డి (Rangareddy) లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టులో స్పెషల్ లీవ్ (SPL) పిటిషన్ను సుప్రీం కోర్టు (Supreme Court) కొట్టి వేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలతో తాను దిగ్భ్రాంతి చెందానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇది సుప్రీంకోర్టును మాత్రమే కాదు.. భారత రాజ్యాంగాన్ని కూడా కించపరచడమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు తీర్పులపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు. కంచ గచ్చిబౌలి అటవీ సమస్య అయినా లేదా పాలమూరు ప్రాజెక్ట్ కేసు అయినా ఇప్పుడు సమయం కావచ్చునని అన్నారు. తన పార్టీ కోర్టులకు లోబడాలా.. వద్దా అనేది రాహుల్ గాంధీ నిర్ణయించుకుంటారని అన్నారు. మీ నాయకులకు దేశ న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేనప్పుడు రాజ్యాంగ కాపీతో "న్యాయ్ యాత్రలు" చేయలేరని కేటీఆర్ అన్నారు.
‘‘మహేష్ కుమార్ గౌడ్ గారు.. మీ నాయకుడు రాహుల్ గాంధీ న్యాయ యాత్రలు చేస్తుంటారు.. మీ కాంగ్రెస్ నాయకులు మాత్రం న్యాయాన్ని, కోర్టులను, తీర్పులనూ అపహాస్యం చేస్తుంటారు.. మీకు అనుకూలం కాకుంటే అది నిజం కాదు.. మీకు నచ్చకపోతే అది న్యాయం కాదు.. నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అనుకూలంగా తీర్పు ఇస్తే…. తప్పు అని చెప్తారా.. కంచె గచ్చిబౌలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా.. మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read: విశాఖలో కరోనా కలకలం..
కేటీఆర్కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్
కేటీఆర్కు ధైర్యముంటే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైన సీఐడీ విచారణ లేదా న్యాయ విచారణ కోరాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని.. విచారణ జరిగితే అవినీతి ఏ విధంగా జరిగిందన్నది బట్టబయలవుతుందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై న్యాయస్థానం తీర్పు అనుకూలంగా వచ్చినట్లుగా, తాము నీతిమంతులైనట్లు చెప్పేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. వాస్తవానికి నాగం జనార్దన్రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై పూర్తి ఆధారాలతో కేసు వేశారని, అయితే ఆయన్ను బీఆర్ఎస్లో చేర్చుకుని కేసును నీరుగార్చారని చెప్పారు. బీఆర్ఎస్లో ఉన్న నేత... బీఆర్ఎస్ పార్టీ అధినేతపై ఎలా కొట్లాడతారని ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసులతో కల్వకుంట్ల కుటుంబంలో ఆందోళన మొదలైందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణకుమార్ అన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరై.. తన నిజాయతీని నిరూపించుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇండిగో పైలట్ అభర్థనను తిరస్కరించిన పాక్
మద్యం కేసుతో జగన్కు నిద్ర పట్టడం లేదు
For More AP News and Telugu News