Share News

Jaggareddy in Films: సినిమాల్లోకి జగ్గారెడ్డి.. టైటిల్ ఏంటో తెలుసా

ABN , Publish Date - Mar 10 , 2025 | 12:12 PM

Jaggareddy in Films: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు వెళ్లిన ఆయన ఓ కీలక విషయాన్ని తెలియజేశారు.

Jaggareddy in Films: సినిమాల్లోకి జగ్గారెడ్డి.. టైటిల్ ఏంటో తెలుసా
Congress Working President Jagga Reddy

న్యూఢిల్లీ, మార్చి 10: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Congress Working President Jaggareddy) సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ... రాజకీయాల్లో ఫైట్ చేస్తానని.. తాను సింపతీ మీద రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకొచ్చారు. త్వరలో సినిమాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అతి త్వరలో ఒక ప్రేమ కథ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు ఆఫ్ ది రికార్డ్‌‌లో ఆయన వెల్లడించారు. సినిమాలో మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెళ్ళి చేసే వ్యక్తి అతనే జగ్గారెడ్డి అని అన్నారు. ఈ మధ్య కాలంలో ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఒక కథ ఉంది అని చెప్పారన్నారు.


‘ఆ కథలో మీ పాత్ర ఉందని అన్నారు. ఆ సినిమాలో నటిస్తా అని చెప్పాను. ఈ కథలో నా ఒరిజినల్ క్యారక్టర్ కూడా ఉండబోతుంది. ఈ ఉగాదికి సినిమా కథ విని.. వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాం. పీసీసీ, సీఎం అనుమతి తీసుకొని నటిస్తాను’ అని వెల్లడించారు. ఇక సినిమా పేరును కూడా ప్రకటించేశారు జగ్గారెడ్డి. అదే ‘జగ్గారెడ్డి...వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్‌‌ను ఖారారు చేసినట్లు తెలిపారు.

Most Wanted Cheater Arrest: మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ అరెస్ట్.. మోసాల చిట్టా మామూలుగా లేదుగా


ఇక రాజకీయ అంశాలపై మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చూసి మైండ్ బ్లాక్ అయిందన్నారు. తాను రాజకీయంగా షాక్‌లో ఉన్నట్లు తెలిపారు. తన షాక్‌కు కాలం సమాధానం చెబుతుందన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జట్టి కుసుము అని తెలిపారు. అనుకోకుండా ఢిల్లీకి తెలంగాణ నుంచి నేతలు రాలేదన్నారు. 2017లో రాహుల్ గాంధీ సంగారెడ్డి సభను తానే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాటి కష్టాలు పరిణామాలు చెప్పాలని అనుకున్నానని.. దానిపై రాహుల్ గాంధీని కలిసేందుకు ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు.


రాహుల్ గాంధీని సమయం అడిగానని అన్నారు. కుసుమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీసీఎ భట్టి విక్రమార్క‌కు చెప్పానన్నారు. తాను ఢిల్లీకి వచ్చి కుసుమ అంశం మాట్లాడాలని అనుకున్నానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ అంశాన్ని ముందే చెప్పినట్లు తెలిపారు. తాను ఢిల్లీకి వచ్చినప్పుడు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ,కేసీ వేణుగోపాల్ లేరని జగ్గారెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

BJP MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు

Most Wanted Cheater Arrest: మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ అరెస్ట్.. మోసాల చిట్టా మామూలుగా లేదుగా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 12:26 PM