Share News

Vemulawada Rajanna Temple: రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తత.. భక్తుల ఆందోళన

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:36 PM

వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి‌ అలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Vemulawada Rajanna Temple: రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తత.. భక్తుల ఆందోళన

సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం అభివృద్ధి కోసం.. దర్శనలు నిలిపి వేస్తారా అంటూ నిలదీశారు. మరోవైపు రాజన్న ఆలయం ముందు భక్తులు, బీజేపీ నేతల ఆందోళన దిగారు. ఆలయం మూసివేసి రాజన్న భక్తులను అవమానిస్తున్నారా.. అని మండిపడ్డారు. గుడిలో దర్శనాల నిలిపివేతపై అధికారులు పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆలయ ఈవోతో బీజేపీ నేతల వాగ్వవాదానికి దిగారు. దర్శనలు నిలిపివేయలేదని ఈవో నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.


వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి‌ అలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారికి సమర్పించే ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కేవలం ఏకాంత సేవలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై అధికారులు పూర్తిగా సమాచారం ఇవ్వలేదని భక్తులు, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.


ఇవి కూడా చదవండి:

Trump Invite Modi: కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Updated Date - Oct 12 , 2025 | 01:50 PM