Metro trains: అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు..
ABN , Publish Date - Dec 31 , 2025 | 07:34 AM
కొత్త ఏడాదిని పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుపుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపిరు. ప్రతిరోజూ రాత్రి 11 గంటల వరకు నడిచే రైళ్లు... నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని సమయాభావాన్ని పెంచినట్లు తెలిపారు.
హైదరాబాద్ సిటీ: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నగరంలోని మెట్రో రైళ్ల(Metro trains) సమయాన్ని పొడిగించినట్లు ఎల్అండ్టీ మెట్రోరైలు అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లు రాత్రి 11 గంటల వరకు నడుస్తాయని, బుధవారం మాత్రం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. చివరి రైలు రాత్రి ఒంటిగంటకు ప్రారంభ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
Read Latest Telangana News and National News
