Share News

JAC: డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘంతో చర్చిస్తాం

ABN , Publish Date - May 08 , 2025 | 04:57 AM

ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు లేవనెత్తిన అన్ని డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో చర్చిస్తామని నవీన్‌ మిత్తల్‌ నేతృత్వంలోని అధికారుల కమిటీ తెలిపింది.

JAC: డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘంతో చర్చిస్తాం

  • ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో అధికారుల కమిటీ

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు లేవనెత్తిన అన్ని డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో చర్చిస్తామని నవీన్‌ మిత్తల్‌ నేతృత్వంలోని అధికారుల కమిటీ తెలిపింది. మరోసారి సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు హామీ ఇచ్చింది. ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ బుధవారం సచివాలయంలోని రెవెన్యూ ముఖ్యకార్యదర్శి సమావేశ హాల్‌లో ఉద్యోగ సంఘాలతో సమావేశమైంది. జేఏసీ నుంచి చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావుతోపాటు 29 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.


ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన 57 డిమాండ్లపై అంశాల వారీగా చర్చించారు. ఉద్యోగుల జేఏసీ పేరుతో రెండు సంఘాలు ఉన్నాయని.. కొంతమంది ప్రభుత్వ పెద్దలు, అధికారుల ప్రొత్సాహంతో లచ్చిరెడ్డి నేతృత్వంలో ఏర్పడిన జేఏసీ.. ఉద్యోగుల మధ్య గందరగోళం సృష్టిస్తోందని మారం జగదీశ్వర్‌, ఏలూరి శ్రీనివా్‌సరావు కమిటీకి ఫిర్యాదు చేశారని జేఏసీ ప్రచార కన్వీనర్‌ బి.శ్యామ్‌ తెలిపారు. ఆ జేఏసీని సమావేశానికి పిలిస్తే తాము హాజరుకాబోమని స్పష్టం చేయడంతో వాళ్లకు ఇచ్చిన సమయాన్ని అధికారుల కమిటీ రద్దు చేసిందని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:57 AM