Share News

Eatala Rajendar: పిల్లలు పుట్టినా కల్యాణలక్ష్మి ఊసేలేదు: ఈటల

ABN , Publish Date - May 06 , 2025 | 05:03 AM

కల్యాణలక్ష్మి చెక్కులను పెళ్లి పందిరిలోనే అందజేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినవారు, ఇప్పుడు పిల్లలు పుట్టాక కూడా ఇవ్వడం లేదని ఎంపీ ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు.

Eatala Rajendar: పిల్లలు పుట్టినా కల్యాణలక్ష్మి ఊసేలేదు: ఈటల

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి చెక్కులను పెళ్లి పందిరిలోనే అందజేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినవారు, ఇప్పుడు పిల్లలు పుట్టాక కూడా ఇవ్వడం లేదని ఎంపీ ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్‌ రెడ్డికి పాలన చేయడానికి నైతిక హక్కు లేదని విమర్శించారు.


బిల్లులు చెల్లించేందుకు మంత్రులకు 10 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిన దయనీయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, అలా ఇచ్చినా కూడా బిల్లులు పొందలేక పోతున్నారని అన్నారు. రాహుల్‌ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్నారు కానీ రాజ్యాంగ రచయిత అంబేడ్కర్‌ను ఓడించింది కాంగ్రెస్‌ పార్టీయే అని ఈటల అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 05:03 AM