Share News

Hyderabad: హీరో విజయ్‌ దేవరకొండపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ABN , Publish Date - May 02 , 2025 | 10:18 AM

హీరో విజయ్‌ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ట్రైబల్స్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ బాపూనగర్‌ అధ్యక్షుడు కిషన్‌రాజ్‌ చౌహాన్‌ డిమాండ్ చేశారు. ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ మాట్లాడారు. అయితే.. వ్యాఖ్యలను గిరిజన సంఘాలు తప్పుపడుతున్నాయి.

Hyderabad: హీరో విజయ్‌ దేవరకొండపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

- గిరిజన జాతిని అవమానించారని ఆరోపించిన లాయర్‌ కిషన్‌రాజ్‌ చౌహాన్‌

హైదరాబాద్: సినీ నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గత నెల 26న జరిగిన తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ మాట్లాడారు. ఆ మూవీ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ బాపూనగర్‌ అధ్యక్షుడు కిషన్‌రాజ్‌ చౌహాన్‌ ఆరోపించారు. హైదరాబాద్‌(Hyderabad)లోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గిరిజనులను అవమానించేలా మాట్లాడడం దారుణమని, విజయ్‌ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వార్తను కూడా చదవండి: ఆ ఏరియాలో.. డ్రోన్‌ల ఎగరవేతపై నిషేధం..


city6.jpg

ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

Gold Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత

Read Latest Telangana News and National News

Updated Date - May 06 , 2025 | 07:32 AM