Telangana: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం
ABN , Publish Date - May 02 , 2025 | 06:03 AM
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే తన లక్ష్యమని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం చెప్పారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, కల్తీ కల్లా విక్రయించే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం
హైదరాబాద్ సిటీ, మే1(ఆంధ్రజ్యోతి): తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా నియమితులైన ఆయ న నాంపల్లి ఆబ్కారీ భవన్లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భం గా షానవాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను చెలామణీ చేస్తున్న ముఠాలు, కల్తీ కల్లుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లపై క ఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News