Share News

Hyderabad: ఆ ఏరియాలో.. డ్రోన్‌ల ఎగరవేతపై నిషేధం..

ABN , Publish Date - May 02 , 2025 | 09:51 AM

హైదరాబాద్ నగరంలో కొన్ని ఏరియాల్లో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం విధిస్తూ కమిషనర్‌ అవినాష్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్‌ తెలిపారు. ఈ నిషేధం 4 నుంచి జూన్‌ 2 వరకు అమలులో ఉంటుందని తెలినారు.

Hyderabad: ఆ ఏరియాలో.. డ్రోన్‌ల ఎగరవేతపై నిషేధం..

- మే 4 నుంచి జూన్‌2 వరకు అమలు

- ఆదేశాలు జారీ చేసిన సీపీ అవినాష్‌ మహంతి

హైదరాబాద్‌ సిటీ: నగరంలో ప్రపంచ మిస్‌ వరల్డ్‌ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌(Cyberabad Police Commissionerate) పరిధిలోని పలు ప్రాంతాల్లో డ్రోన్‌ల ఎగరవేతపై నిషేధం విధిస్తూ కమిషనర్‌ అవినాష్‌ మహంతి గురువారం ఆదేశాలు జారీ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: గద్వాల, కర్నూల్‌ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు


city5.2.jpg

మే 4వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు సైబరాబాద్‌ పరిధిలోని హైటెక్స్‌ మాదాపూర్‌, ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు శంషాబాద్‌, గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం(RGI Airport Shamshabad, Gachibowli Indoor Stadium), చిలుకూరు ఎకో పార్కు, టీ హబ్‌, శిల్పారామం, శిల్ప కళావేదిక, ట్రైడెంట్‌ హోటల్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో రిమోట్‌ కంట్రోల్డ్‌ డ్రోన్స్‌తో పాటు పారా గ్లైడర్స్‌, మైక్రోలైట్‌ ఎయిర్‌ క్రాప్ట్స్‌లను 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఎగరడం నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

Gold Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత

Read Latest Telangana News and National News

Updated Date - May 06 , 2025 | 07:25 AM