IND VS SA T20: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా... బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:00 PM
ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా కటక్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ(మంగళవారం) తొలి మ్యాచ్ జరగనుంది. ఈ తొలి టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్ లోని బారబతి స్టేడియం వేదికగా ఇవాళ జరుగుతుంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. మరోవైపు గాయంతో వన్డే సిరీస్ కు దూరమైన శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ లో ఉన్నాడు. గిల్ రాకతో సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు వికెట్కీపర్, బ్యాటర్ కోటాలో జితేశ్ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా తరఫున నొకియా చాలాకాలం తర్వాత బరిలోకి దిగుతున్నాడు.
తుది జట్లు..
భారత్:
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్),అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
దక్షిణాఫ్రికా:
క్వింటన్ డికాక్ (వికెట్కీపర్), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్ ఫెరియెరా, మార్కో యన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోకియా
ఇవీ చదవండి:
Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?