e Sim Scam : e Sim స్కాంపై DoT వార్నింగ్.. అసలేంటీ స్కాం..
ABN, Publish Date - Mar 10 , 2025 | 09:05 PM
eSIM Scam Alert : మొబైల్ ఫోన్ యూజర్లు బీ అలర్ట్. సైబర్ నేరగాళ్లు కొత్త స్కాంకు తెర తీశారు. ఈ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టెలికాం విభాగం హెచ్చరిస్తోంది. eSIM మోసంపై కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని DoT సూచిస్తోంది. అసలేంటీ ఈ-సిమ్ స్కాం.. ఎలా జాగ్రత్త పడాలి..

తాజా మొబైల్ మోసం నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇక్కడ ఉంది. కొత్త మొబైల్ స్కామ్ గురించి టెలికాం విభాగం హెచ్చరిస్తోంది, సురక్షితంగా ఎలా ఉండాలో తెలుసుకోండి.

eSIM మోసం గురించి DoT హెచ్చరిస్తుంది స్కామర్ల నుండి మీ మొబైల్ నంబర్ను రక్షించుకోవడానికి మీరు ఇది తప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు స్కామర్లు మీ డబ్బు దొంగిలించడానికి సిమ్ కార్డును లక్ష్యంగా చేసుకుంటున్నారు.

మీ మొబైల్ నంబర్ హ్యాక్ కాకుండా ఎలా నిరోధించాలో ఇక్కడ ఉంది. స్కామర్లు కస్టమర్ ఎగ్జిక్యూటివ్ లుగా తమను తాము పరిచయం చేసుకుంటున్నారు. ముందుగా E Sim గురించిన వివరాలు మీకు చెప్తారు.

తర్వాత SMS ద్వారా మీకు వచ్చిన కోడ్ చెప్పమని అడుగుతారు. కోడ్ షేర్ చేయడం వల్ల స్కామర్లకు మీ ఫోన్ నియంత్రించే అవకాశం లభిస్తుంది.

దీంతో వారు మీ బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేసి మీ పేరున రుణాలు తీసుకోగలుగుతారు. ఒకవేళ ఇలాంటి సందర్భాలు ఎదురైతే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వెంటనే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ను సంప్రదించండి.

ఇలాంటి స్కామర్ల నుండి మీ మొబైల్ నంబర్ను సురక్షితంగా ఉంచుకోవాలని టెలికాం సంస్థ చెబుతోంది. ఫోన్ లేదా SMS ద్వారా వచ్చిన కోడ్ ఎప్పుడూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరిస్తోంది.

అపరిచిత కాల్స్ పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. అలాంటి కాల్స్ గురించి వెంటనే సర్వీస్ ప్రొవైడర్, పోలీసులకు సమాచారం అందించండి. ఇంకా, సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఫిర్యాదు చేయండి.
Updated at - Mar 10 , 2025 | 09:07 PM