Congress Janhita Padayatra: వరంగల్ జిల్లాకు చేరిన కాంగ్రెస్ జనహిత పాదయాత్ర.. పాల్గొన్న అగ్రనేతలు
ABN, Publish Date - Aug 26 , 2025 | 08:01 AM
తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర వరంగల్ జిల్లాకు సోమవారం నాడు చేరుకుంది. ఇల్లంద నుంచి వర్థన్నపేట వరకు జనహిత పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
1/9
తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర వరంగల్ జిల్లాకు సోమవారం నాడు చేరుకుంది.
2/9
ఇల్లంద నుంచి వర్థన్నపేట వరకు జనహిత పాదయాత్ర కొనసాగింది.
3/9
ఈ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
4/9
కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రలో భారీగా పాల్గొన్న నేతలు, కార్యకర్తలు
5/9
పాదయాత్రలో ప్రజా సమస్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అడిగి తెలుసుకున్నారు.
6/9
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న విధానంపై అడిగి మహేష్ కుమార్ గౌడ్ తెలుసుకున్నారు.
7/9
ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
8/9
కేంద్ర ఎన్నికల సంఘం తమ చేతుల్లో లేదని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లపై తామెలా లెక్కలు తేలుస్తామని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్.
9/9
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని..మీరే లెక్కలు తేల్చాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు.
Updated at - Aug 26 , 2025 | 08:05 AM