Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
ABN, Publish Date - May 15 , 2025 | 09:58 AM
భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో సరస్వతీ పుష్కరాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు పుష్కర స్నానం చేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద పాల్గొన్నారు. ఇవాళ తెల్లవారుజామున 5.44 నిమిషాలకు మాధవానంద సరస్వతి పుష్కర స్నానం ప్రారంభించారు.
1/12
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి.
2/12
మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలకు అంకురార్పణ చేశారు.
3/12
గురువారం ఉదయం 5.44 గంటలకు ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి.
4/12
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు గురువారం నాడు పుష్కర స్నానం చేశారు.
5/12
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద, తదితరులు పాల్గొన్నారు.
6/12
సరస్వతీ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
7/12
భక్తులు పుష్కర స్నానాలు చేసిన అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారిని దర్శించుంటున్నారు.
8/12
పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలోని ముక్తీశ్వర క్షేత్రాన్ని ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
9/12
పుష్కరాల కోసం రూ.35 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది.
10/12
సరస్వతీ పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
11/12
పుష్కరఘాట్లు, తాగునీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుద్ధ్యానికి దేవాదాయశాఖ ప్రాధాన్యం ఇచ్చింది.
12/12
ఎండల తీవ్రత ఉన్నందున టెంట్లు, పందిళ్లతో భక్తులకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. సరస్వతీ పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తులతో రద్దీగా మారింది.
Updated at - May 15 , 2025 | 11:19 AM