Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రత మహోత్సవం.. చార్మినార్ వద్ద భక్తుల సందడి..
ABN, Publish Date - Aug 08 , 2025 | 02:20 PM
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా హైదరాబాద్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణ శుక్రవారం కావడంతో చార్మినార్, భాగ్యలక్ష్మీ ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
1/6
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరలక్ష్మీ వ్రత వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
2/6
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ వద్ధ ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
3/6
శ్రావణ శుక్రవారం నాడు ప్రత్యేక అలంకరణలో ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ క్యూలైన్లతో నిండిపోయి ఉన్నాయి.
4/6
నగరంలోని అష్టలక్మీ దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత వేడుకల వైభవంగా జరిగాయి.
5/6
అష్టలక్మీ దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన పాల్గొన్న భక్తులు.
6/6
అష్టలక్ష్మీ దేవాలయంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు.
Updated at - Aug 08 , 2025 | 02:20 PM