Saraswati Pushkaralu 2025: సరస్వతీ పుష్కరాలకు భారీగా తరలి వస్తున్న భక్త జనం
ABN, Publish Date - May 16 , 2025 | 05:09 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలకు అంకురార్పణ చేశారు. గురువారం ఉదయం 5.44 గంటలకు ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగనున్నాయి. నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
1/15
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం అయ్యాయి.
2/15
శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలకు అంకురార్పణ చేశారు.
3/15
గురువారం ఉదయం 5.44 గంటలకు ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగనున్నాయి.
4/15
నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
5/15
ఈ పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలోని ముక్తీశ్వర క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
6/15
తెలంగాణ నలుమూలల నుంచి రోజుకు 40వేల నుంచి 50వేల మంది భక్తులు సరస్వతీ పుష్కరాలకు వస్తారని అధికారులు అంచనా వేశారు.
7/15
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం కోసం క్యూలైనులో వేచి ఉన్న భక్తులు
8/15
భక్తుల పుణ్యస్నానాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జ్ఞాన సరస్వతి ఘాట్లలో అధికారులు వసతులు సిద్ధం చేశారు.
9/15
ఎండల తీవ్రత నేపథ్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
10/15
పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులు నడపుతోంది.
11/15
పుష్కరాల నేపథ్యంలో 1700 మంది పోలీసులు భద్రత విధుల్లో పాల్గొంటున్నారు.
12/15
త్రివేణి సంగమం వద్ద ప్రతిరోజు ఉదయం 8.30 నుంచి 11గంటల వరకు బ్రాహ్మణులు యాగాలు జరిపిస్తున్నారు.
13/15
త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న యువతులు
14/15
త్రివేణి సంగమంలో స్వామివారిని మొక్కుకుంటున్న భక్తులు
15/15
నందీశ్వర స్వామిని మొక్కుతున్న భక్తులు
Updated at - May 16 , 2025 | 05:22 PM