CM Chandrababu: శ్రీశైలం దేవస్థానం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
ABN, Publish Date - Oct 06 , 2025 | 09:54 AM
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ, అటవీ శాఖలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులని ముఖ్యమంత్రి ఆదేశించారు.
1/7
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ, అటవీశాఖలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
2/7
ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
3/7
తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులని ముఖ్యమంత్రి ఆదేశించారు.
4/7
శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి పలు సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.
5/7
ప్రతి ఏడాది శ్రీశైలం ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.
6/7
ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించాలని మార్గనిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
7/7
దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల భూమిని దేవదాయశాఖకు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Updated at - Oct 06 , 2025 | 10:04 AM