Union Budget 2025 - 26: పథకాలకు భారీ కేటాయింపులు.. అవి ఎంతెంత అంటే ?
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:16 PM
Union Budget 2025 - 26: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేంద్రం అందించే పలు పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 01: 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అంటే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 150 పథకాలకు బడ్జెట్లో కీలక కేటాయింపులు చేసింది. ఆ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
గ్రామీణ ఉపాధి హామీకి రూ. 86 వేల కోట్లు.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ.19 వేల కోట్లు.
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్కు రూ.19 వేల కోట్లు
వాటర్ షెడ్ అభివృద్ధికి రూ. 2,505 కోట్లు
కృషి వికాస యోజనకు రూ. 8,500 కోట్లు
ఆయుష్ మిషన్కు రూ.1,275 కోట్లు
సమగ్ర శిక్షా యోజనకు రూ. 41,250 కోట్లు
పోషణ్ శక్తికి రూ.12,500 కోట్లు
ప్రధాన మంత్రి స్కూల్ రైజింగ్కి రూ. 7,500 కోట్లు
ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.30 వేల కోట్లు
ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయలకు రూ. 7 వేల కోట్లు
ఆయుష్మాన్ భారత్కి రూ.9,600 కోట్లు
పోలీసు ఆధునీకరణకు రూ.4,069 కోట్లు
ప్రధాని ఆవాస యోజన (అర్బన్) రూ.19,794 కోట్లు
ప్రధాని ఆవాస యోజన (గ్రామీణ) రూ.54,832 కోట్లు
అమృత్కి రూ.10 వేల కోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) రూ. 5 వేల కోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) రూ.7,192 కోట్లు
అర్బన్ ఛాలంజ్ ఫండ్ రూ.10 వేల కోట్లు
పీఎం కృషీ సించాయి యోజన రూ. 8,260 కోట్లు
నదుల అనుసంధానానికి రూ. 2,400 కోట్లు
పోలవరం ప్రాజక్టుకు రూ. 5,936 కోట్లు
జలజీవన్ మిషన్ (గ్రామీణ తాగునీటి) రూ. 67 వేల కోట్లు
పన్ను మినహాయింపుల కోసం రూ. 22,600 కోట్లు
అంగన్వాడీ రూ. 21,960
పంటల భీమా రూ.12,242 కోట్లు
పీఎం ఆశా రూ. 6,941 కోట్లు
పీఎం కిసాన్ రూ. 63,500 కోట్లు
పత్తి టెక్నాలజీ మిషన్ రూ.500 కోట్లు
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
పప్పు ధాన్యాల మిషన్ రూ. వెయ్యి కోట్లు
పండ్లు, కూరగాయల మిషన్ రూ. 500 కోట్లు
హైబ్రిడ్ విత్తనాల మిషన్ రూ. 100 కోట్లు
మఖనా బోర్డుకు రూ.100 కోట్లు
యూరియా సబ్సిడీ రూ.1,18,900 కోట్లు
పోషకాహార సబ్సిడీ రూ. 49 వేల కోట్లు
కొత్త పారిశ్రామిక పార్క్లకు రూ. 2,500 కోట్లు
టెలికం మౌలిక సదుపాయలకు రూ. 28,400 కోట్లు
గరీబ్ కళ్యాణ్ యోజన రూ. 2 లక్షల 3 వేల కోట్లు
రక్షణ పరిశోధనలకు రూ.14,924 కోట్లు
విమానాలు, ఏరో ఇంజన్లకు రూ. 48,614 కోట్లు
రక్షణ నిర్మాణాలకు రూ. 11,452 కోట్లు
నావెల్ ఫ్లీట్ రూ. 24,391
సెమీ కండక్టర్స్ వ్యవస్థ ఏర్పాటు రూ. 7 వేల కోట్లు
ఇండియా ఎఐ మిషన్ రూ. 2 వేల కోట్లు
మెట్రో ప్రాజక్టులు రూ.31,239 కోట్లు
పోలీసు మౌలిక వసతులకు రూ. 4,379
కొత్త ఉద్యోగాల సృష్టికి రూ. 20 వేల కోట్లు
కుసుం రూ. 2,600 కోట్లు
సూర్య ఘర్ రూ. 20 వేల కోట్లు
పేదలకు ఎల్పిజి కనెక్షన్లకు రూ. 9,100 కోట్లు
కొత్త రైల్వే లైన్లకు రూ. 32,235 కోట్లు
డబ్లింగ్కి రూ. 32 వేల కోట్లు
రోలింగ్ స్టాక్ రూ. 45,530 కోట్లు
జాతీయ రహదారులకు రూ. 1, 70, 266 కోట్లు
మంత్రిత్వ శాఖ ద్వారా రహదారులకు రూ.1,16,292 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనలకు రూ.20 వేల కోట్లు
ఏకలవ్య మోడల్ స్కూల్స్ రూ. 7,089
ఖేలో ఇండియా రూ. 1000 కోట్లు