Delhi Airport: ఢిల్లీపై మిసైల్ అటాక్.. ఇది నిజమేనా..
ABN , Publish Date - May 10 , 2025 | 01:58 PM
India Pakistan War: పాకిస్థాన్ తన నక్కబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. భారత్తో పోరాడటం చేతగాక విద్వేష ప్రచారాలు, ఫేక్ న్యూస్ ప్రాపగండాను వైరల్ చేస్తూ పరువు తీసుకుంటోంది.

భారత సైనిక దళాలు రెచ్చిపోతుండటంతో తట్టుకోలేకపోతోంది పాకిస్థాన్. త్రివిధ దళాలు చేస్తున్న దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దాడులు, ప్రతిదాడులతో తమపై తెగబడుతుండటంతో పాక్ లబోదిబోమంటోంది. మనల్ని యుద్ధక్షేత్రంలో ఎదుర్కోలేక సోషల్ మీడియాను ఆశ్రయిస్తోంది. అక్కడ విద్వేష ప్రచారాలు, ఫేక్ న్యూస్ ప్రాపగండాతో పరువు తీసుకుంటోంది పాక్. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పేల్చేశామంటూ నెట్టింట పలు పాత వీడియోలను వైరల్ చేస్తోంది. మరి.. ఆ వీడియోల్లో నిజమెంత.. ఢిల్లీ ఎయిర్పోర్ట్పై పాక్ అటాక్ చేసిందా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం..
ఇందులో నిజమెంత..
భారత్లోని కీలక నగరాల్లో దాడులకు తెగబడ్డామంటూ ఫేక్ వీడియోలు, ఫొటోలతో తమ దేశ ప్రజల మనసుల్ని గెలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్థాన్. ఫేక్ అకౌంట్స్ నుంచి సంబంధం లేని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తూ ఇండియాపై అటాక్ చేశామని బీరాలకు పోతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ను పేల్చేశామంటూ ఓ వీడియోను వదిలింది. అయితే ఇది ఫేక్ వీడియో అని.. ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీదకు ఎలాంటి పాక్ మిసైల్ అటాక్ జరగలేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ఫేక్ న్యూస్ను నమ్మొద్దని ప్రజల్ని కోరింది. కాగా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ వీడియోనే కాదు.. మరిన్ని ఫేక్ వీడియోలతో జనాల్ని కన్ఫ్యూజ్ చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. అదే టైమ్లో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందకు అబద్ధాలు చెబుతోంది. భారత సరిహద్దు ప్రాంతాల్లోని ఆలయాలు, జనావాసాలపై దాడులకు తెగబడుతున్న శత్రుదేశం.. తాము ప్రజలపై అటాక్ చేయలేదంటూ బుకాయిస్తోంది. అయితే ప్రజల ఇళ్లు, ఆలయాలపై పాక్ దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను భారత రక్షణ మంత్రిత్వ శాఖ బయటపెట్టింది.
ఇవీ చదవండి:
పాక్ వైమానిక స్థావరాలపై బాంబుల వర్షం
నా పుట్టినరోజు వేడుకలకు ఎవరూ రావొద్దు
పాక్ విష ప్రచారం.. చైనా వైరల్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి